తన కూతురు హత్య కేసులో అనవసరంగా ఓ అమాయకుడిని బలి చేస్తున్నారని, ఈ కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని హతురాలు ఆయేషా తల్లి శంషాద్ బేగం అంటున్నారు. ఈ హత్యలో అసలు సూత్రదారులు అయిన కోనేరు రంగారావు బంధువులు, కవిత సౌమ్య కుటుంబం వారిని వదిలి సత్యంబాబును పోలీసులు పట్టుకెళ్లి అనవసరంగా పెద్దవారిని వదిలేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు మధ్యలో మేము, సత్యంబాబు వంటి మధ్యతరగతి వాళ్లమే బలి అవుతున్నామన్నారు. కాని కేసులో ప్రధాన నిందితులు అయిన పెద్దవాళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. సత్యంబాబును కాకుండా అసలు హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, అయితే వారికి మరణశిక్ష కన్నా మరెవరూ ఆడవారిపై దాడులు చేయటానికి భయపడేలా కాలో, చెయ్యో తీసేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడి కోర్టులో తీర్పు పెద్దవాళ్లకు అనుకూలంగా ఉంటే పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామని శంషాద్ అంటున్నారు. అయితే మహిళా సంఘాలు తప్పు ఎవరు చేశారనే దానితో సంబంధం లేకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
Wednesday, September 29, 2010
ఆయేషా హత్య కేసు.. తుది తీర్పు నేడే..
nitya007's
|
Wednesday, September 29, 2010
|
NEWS IN TELUGU
|

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment